ఏఐతో భవిష్యత్తులో ఆందోళనకర పరిస్థితులు.. ఏఆర్ రెహమాన్ షాకింగ్ కామెంట్స్! వాటిని అందరూ తెలుసుకోవాలి..
Sat Apr 19, 2025 14:22 Entertainment.202504198936.jpg)
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం భారీగా పెరుగుతోంది. అన్ని రంగాలలో ఏఐ వినియోగం అంతకంతకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. సినిమాల్లోనూ దీని వినియోగం పెరిగింది. ఏఐను ఉపయోగించి దివంగత గాయకుల వాయిస్తో పాటలను క్రియేట్ చేస్తున్నారు. ఇలా విపరీతంగా పెరుగుతున్న ఏఐ వినియోగం విషయమై ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నియంత్రించకపోతే భవిష్యత్తులో ఆందోళనకర పరిస్థితులు తలెత్తుతాయని ఆయన హెచ్చరించారు. ఏఐ టెక్నాలజీ అనేది చాలా శక్తివంతమైదని, కానీ దాన్ని అవసరానికి మించి వినియోగిస్తే దుష్పరిణామాలు తప్పవు అని అన్నారు.
ఇది కూడా చదవండి: ఏపీలో ఆ రైల్వే స్టేషన్కు మహర్దశ! రూ.850 కోట్లతో... ఎయిర్పోర్ట్ రేంజ్లో కొత్త లుక్!
రెహమాన్ మాట్లాడుతూ... "ఏఐ వల్ల మంచి, చెడు రెండూ ఉన్నాయి. మంచి కోసం మాత్రమే దీన్ని వినియోగించాలి. కొన్ని రోజులుగా దీని వినియోగం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని అందరూ తెలుసుకోవాలి. కొన్ని చెత్త పాటలను కూడా గొప్ప గాయకులు పాడినట్లు ఏఐతో క్రియేట్ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియడం లేదు" అని తెలిపారు. కాగా, గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'లాల్ సలామ్' చిత్రంలో దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్ల వాయిస్ను ఏఐతో రెహమాన్ పునఃసృష్టించిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: జగన్ గుండెల్లో గుబులు.. వలసబాటలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి రోజా! ఆ పార్టీలోకి అడుగు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..? రేసులో 'ఆ నలుగురు' నేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!
వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..
తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టి, పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!
బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!
అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!
బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!
వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Rahmans #AI #ArtificialIntelligence
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.